రెండు తెలుగు రాష్ట్రాల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కార్తీకదీపం’ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులంతా వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారు… వారి జీవితం ఎప్పుడు బాగుపడుతుంది అని ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఈ సీరియల్ చివరి ఘట్టానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ మరింత ఇంట్రెస్టింగ్ గా గడుస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… హిమ మోనిత తో మాట్లాడుతూ “మీరు డాడీ కి ఎందుకు చెప్పారు..? నేను ఇక్కడున్నాను అని అడుగుతుంది.” అందుకు మోనిత – “డాడీ నే కదా ఏం కాదులే…. ఈ ప్రపంచంలో వంటలక్కను డాక్టర్ బాబు ని కలిపే ఏకైక మనిషిని నేనే” అని తన డైలాగ్ తో హిమ ను పడగొడుతుంది. ఇక ఆ తర్వాత హిమ “మీతో రోజు ఫోన్ చేసి మాట్లాడాలి అంటే అందరూ ఉంటారు…. అమ్మకు మీ దగ్గరికి వెళ్ళాలి అని చెబితే వద్దు అంటుంది. వారణాసి ఆటోలో వస్తే అందరికీ చెప్పేస్తాడు. అందుకే వెంకటేష్ ఆటోలో వచ్చాను” అని చెబుతుంది.
వెంటనే మోనిత లేనిపోని ప్రేమ కురిపిస్తూ “అయ్యో నువ్వు ఎలా బ్రతికేదానివి…. ఇప్పుడు ఆటో లో వస్తున్నావా? ఇంతి ముందు ఆటో చూస్తే మీ డాడీ కోప్పడతాడు వెంటనే అతన్ని పంపించేసి రా “అంటుంది. ఇక ఆ తర్వాత హిమతో “బయటకు వచ్చేటప్పుడు…. ఇంట్లో చెప్పి రావచ్చు కదా…. అందరూ కంగారు పడతారు. ఇక రౌడీ అయితే ఏడ్చి నా మీద కిడ్నాప్ కేస్ పెట్టినా పెడుతుంది” అని అంటుంది వెంటనే డాక్టర్ బాబు కూడా “నాన్నా… ఇంట్లో చెప్పి రాకపోతే అందరూ కంగారు పడతారు కదా…. రౌడీ అయితే ఏకంగా ఏడ్చేస్తుంది. సర్లే అయిందేదో అయిపోయింది ఇంకెప్పుడూ ఇలా చేయకు” అని అంటాడు.
Karthika Deppam : కార్తీక దీపంలో ఇలా సాగుతుందేంటి..?
ఈ లోపల దీప హిమా నుతలుచుకుంటూ ఫోటో చూసి బాగా ఏడుస్తుంది. ఇది మా భార్య భర్తల సమస్య… నన్ను నిరూపించుకుంటే తప్ప ఆయన ముందు తలెత్తుకుని తిరగలేను అని బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఒకపక్క ఒకపక్క మోనిత డాక్టర్ బాబు, హిమ ల ని ఆడిస్తూ ఉంటే మాత్రం పాపం దీప ఏమీ తెలియకుండా అంధకారంలో అంధకారంలో బ్రతుకుతుంది. నిజంగా ఇలా మోనిత చెప్పినట్లు అందరూ ఆటలు ఆడే రోజు వస్తుంది అని ప్రేక్షకులు ఊహించి ఉండరు.