Kartikeya : కార్తికేయ ఇటీవల చావుకబురు చల్లగా అన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాగా నిరాశ పరచింది. కార్తికేయ ఈ సినిమా మీద పెట్టుకున్న ఆశలన్నీ తారుమారయ్యాయి. దాంతో మరోక అవకాశం ఇస్తే గ్యారెంటీగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే సుకుమార్ రైటింగ్స్, జీఏ2 బ్యానర్ లో ఒక సినిమా చేయబోతున్నట్టు వెల్లడించాడు.
అయితే ఈ సినిమా మొదలవక ముందే కార్తికేయ కొత్త సినిమాని తాజాగా ప్రకటించాడు. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇలాంటి పాత్రలోనే ఇటీవల నాగార్జున నటించాడు. వైల్డ్ డాగ్ పేరుతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాగార్జున పర్ఫార్మెన్స్ కి ప్రతీ ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు ఇదే జోనర్ లో కార్తికేయ సినిమా రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
Kartikeya : కార్తికేయ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడా..?
ఇక ఈ సినిమాలో కార్తికేయకి జంటగా యంగ్ బ్యూటీ తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా శ్రీ సరిపల్లి ఈ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కాన్సెప్ట్ వీడియోని విడుదల చేశారు. కార్తికేయ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా డైనమిక్ లుక్ అదిరిపోయిందని అందరూ ప్రశంసిస్తున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికి కరోనా కారణంగా నిలిచిపోయింది. కాగా తాజాగా ఈ సినిమా తిరిగి షూటింగ్ మొదలు పెట్టారు. ఈ సినిమాతో పాటు సుకుమార్ సినిమా గనక హిట్ అయితే కార్తికేయకి వరసగా అవకాశాలు దక్కుతాయంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!