Kathha vintara : టాలీవుడ్ లో స్టార్ ఆర్టిస్ట్ కం కమెడియన్ గా మన్ననలు పొందుతున్న మధునందన్.. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, ఒక లైలా కోసం, టాక్సీవాలా వంటి సినిమాలతో హాస్యనటుడి గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. ప్రస్తుతం “కథ వింటారా” అనే థ్రిల్లర్ తో హీరోగా పరిచయం అవుతున్నాడు.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది..
వంశీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో స్వాతిష్ట, శ్రేయ నావిలే హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి రవి వర్మన్ నీలిమేఘం- సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మసాలా కాఫీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ కి సాయికిరణ్ ముద్దం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సాహిత్యం అందిస్తున్నారు. కథ వింటారా సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కథ వింటారా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మంచి ఇంప్రెషన్ కలిగించింది. ఈ సినిమా ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.