ప్రస్తుతం ప్రపంచాన్నంతా కరోనా కమ్మేసింది. భారత్ లో కూడా విలయం సృష్టిస్తోంది. అధిక జనాభా వల్ల కూడా పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. అయితే.. ప్రముఖ తెలుగు ఫిలిం క్రిటిక్ కత్తి మహేశ్ మాత్రం ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో ‘దాదాపు 56 లక్షల మంది కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్ సేఫ్ అని వెనక్కి వచ్చేశారంట..’ అని తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ కామెంట్ చేశాడు. ఏపీలో గత నాలుగు రోజులుగా 2వేల నుంచి 5వేల వరకూ ప్రతి రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ సేఫ్ అని ఎలా అంటావు కత్తి మహేశ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
నిజానికి ఏపీలో కరోనా టెస్టుల నిర్వహణ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చింది జగన్ ప్రభుత్వం. ఆర్టీసీలోని ఏసీ బస్సులను కోవిడ్ మొబైల్ టెస్ట్ సెంటర్లుగా మార్చి జిల్లాకు రెండు చొప్పున 13 జిల్లాలకు 52 బస్సులు పంపించారు. రోజూ వేలల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయి. అయితే.. ప్రజల్లో ఉన్న అవగాహలోపంతో కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 53వేలు దాటాయి. 700పైగా మరణాలూ సంభవించాయి.
ఏపీ మాత్రమే కాదు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ లెక్కలతో ఎలా ఏపీ సేఫ్ లో ఉన్నట్టు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కూడా కత్తి సమాధానం చెప్తున్నాడు. అవును.. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోని వారు వచ్చేశారు అని చెప్పుకొస్తున్నాడు.