35.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Breaking: కావేరీ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు.. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణీకులు

Share

Breaking: హైదరాబాద్ జెఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురైయ్యారు. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో నుండి మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు బస్సు నుండి దింపేశారు.

Fire Accident

 

ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share

Related posts

చంద్రబాబుకు మాజీల లేఖ

sarath

RRR: ఆ ఒక్క సీన్ సెకండాఫ్ మీద అంత ఎఫెక్ట్ చూపిస్తుందా..రాజమౌళి ప్లాన్ వర్కౌట్ కాకపోతే..?

GRK

MULUGU MLA Seethakka: జనం కోసం ఎంతటి దూరాభారమైనా!! ఆ మహిళా ఎమ్మెల్యేను చూసి నేర్చుకోండయ్యా పురుషపుంగవులారా!!

Yandamuri