ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కరోనా తన పంజా విసిరింది. దాదాపు నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రాగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కొద్దిసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అయితే ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వంలో 30 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.
కొంతమంది నేతలు హోమ్ క్వారంటైన్ లోనే ఉంటుండగా ఎమ్మెల్యే సునీత యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇలా ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర రాజకీయ ప్రముఖులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో కేసీఆర్ చివరికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దాదాపు పదిహేను రోజులపాటు కేసీఆర్ ప్రగతి భవన్ కు దూరం కానున్నారు.
గతంలో విపరీత స్థాయిలో కూడా ఆయన ప్రగతిభవన్ లో కేసీఆర్ వరుసబెట్టి మీటింగులు పెట్టడాన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా ఖండించినా కేసీఆర్ వినిపించుకోలేదు. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ప్రగతి భవన్లో కు దూరం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ వంటి ఎన్నో సదుపాయాలను కాదని నేరుగా మనుషులతో ప్రగతి భవన్ లో మీటింగ్ పెట్టడం ఎంత రిస్క్ అన్నది కేసీఆర్ కు ఇప్పటికి తెలిసి వచ్చినట్లుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?