రాజకీయాల్లో బాగా ఆరితేరిన నాయకుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకరు. మన దేశంలోనే రాజకీయాలను ఔపోసన పట్టిన అతికొద్దిమందిలో సీఎం కేసీఆర్ ను ఒకరిగా చెప్పుకోవచ్చు.
ఎవరితో ఏ సమయంలో ఎలా మాట్లాడాలో.. ఎవరికి ఎలా పంచ్ ఇవ్వాలో.. ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలిసిన నేత. మంచి మాటకారి కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా తనను అందుకోలేనంత ముందుంటారు కేసీఆర్.
ఆయన ఏ పని చేసినా అది సంచలనమే. తెలంగాణలో ఏ పథకం ప్రారంభించినా సంచలనమే. ఎందుకంటే.. ఆయన ప్రారంభించే పథకాలు మరే రాష్ట్రంలో ఉండవు. తెలంగాణ పథకాలనే వేరే రాష్ట్రాలు కాపీ కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
పరిపాలనలోనే కాదు.. ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజా సంబంధాల విషయంలోనూ కేసీఆర్ రూటే సెపరేటుగా ఉంటుంది. ప్రజల నాడిని తెలుసుకున్న నేత కాబట్టే.. వరుసగా రెండో సారి తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
ఇంతకీ కేసీఆర్ ఏం చేశారంటే.. ఓ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేశారు. ఎట్ల నడుస్తుంది పని. కార్యదర్శి విధులు ఏంటి? ఏం పనులు చేస్తరు.. ఇలా అన్ని వివరాలు అడిగారు.
అసలు.. ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్ చేయడమేంది.. విడ్డూరం కాకపోతే. ఆ పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ నుంచి ఫోన్ వెళ్లగానే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయింది.
వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి.. నేను సీఎం కేసీఆర్ ని అనగానే ఆ కార్యదర్శి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తర్వాత తేరుకొని సీఎం కేసీఆర్ తో సంభాషించింది.
గ్రామానికి సంబంధించిన పనులు, పంచాయతీ కార్యదర్శి విధులు… అన్ని వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏనుగల్ అనే గ్రామం ఎవరిదో తెలుసా? రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఉన్నారు కదా. ఆయన సొంతూరే అది. అది అసలు మ్యాటర్.