తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను లేస్తే మనిషిని గాను అంటాడు. తననో ఒక సూపర్ మాను గా ఆయన అభివర్ణించుకొంటాడు. మాటలు కోటలు దాటుతాయి. అబ్బా ఆయనకు అంత సీన్ ఉందా అని ఎవరైనా భావిస్తే అది వారి పొరపాటు. స్వయంగా కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గం లోనే కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి పడిందంటే ఆయన ఏమిటో అర్థం చేసుకోండి.
సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కేవలం నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్ ను నిర్మించారు. అయితే ఈ ఉదయం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల శివారు వెంకటాపురం వద్ద కొండపోచమ్మ సాగర్ కుడి కాలువకు గండిపడింది. జలాశయం నుంచి బయటపడిన నీరు గ్రామాన్ని ముంచెత్తింది. పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు కాలువకు నీటి విడుదలను ఆపివేశారు. ఉదయం పూట ఈ ఘటన జరిగింది కాబట్టి సరిపోయిందని, అదే రాత్రివేళ అయితే పెను నష్టం జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కాల్వ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం, ఎగువన కురిసిన వర్షాలకు వచ్చే వరదను అంచనా వేయకుండా నీటి పంపింగ్ కొనసాగించడమే గండికి కారణమని తెలుస్తోంది.సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా కాల్వలను నాసిరకంగా వేశారంటే కేసీఆరు కిఅధికార యంత్రాంగంపై ఎంత పట్టు ఉందో అర్థమవుతుంది కదా?