Kcr : ఆంధ్ర రాష్ట్రంలో ఆర్టీసీని.. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో విలీనం చేయడంతో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని కోరటం, ఆందోళనలు చేయడం అందరికీ తెలిసిందే. 2019 ఏడాది ప్రారంభంలో సరిగ్గా సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె అంటూ రోడ్ ఎక్కటం, ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో తెలంగాణ ఆర్టీసీకి చాలా నష్టాలు రావడం జరిగాయి.దాదాపు 52 రోజులపాటు సమ్మె చేస్తూ ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని అంటూ 26 డిమాండ్లను తెర పైకి తీసుకు రావడం జరిగింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల లో విధులు బహిష్కరించి ర్యాలీలు, ఆందోళనలు చేయడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కెసిఆర్ సర్కారు ఎవరైతే విధులను బహిష్కరించారో వారిపై చర్యలు తీసుకోవడం జరిగింది. చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కేసీఆర్ అప్పుడు మొండిగా వ్యవహరించారు.
ఎక్కడా కూడా ఆర్టీసీ యూనియన్ ల తో మాట్లాడటానికి ముందుకు రాలేదు. రాను రాను సమ్మె ఉధృతం కావడంతో ప్రభుత్వం దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో మంతనాలు జరపడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల తో భేటీ అయి వారి ఇబ్బందులను వినటం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఉద్యోగ భద్రత కల్పించాలని కెసిఆర్ ని ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు కోరడం జరిగింది. అయితే ఈ విషయం గడిచి చాలా సంవత్సరాలు అవుతుండగా తాజాగా టిఎస్ఆర్టిసి లో పని చేసే వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఖరారు చేయడం జరిగింది.
Kcr కేసీఆర్ సంతకం
దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం ఇటీవల చేశారు. విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాలలో వేధింపులకు గురవుతున్నమని.. గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను పరిష్కరించే రీతిలో.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగస్తులకు వేధింపులు లేకుండా.. ఉద్యోగ భద్రత కల్పిస్తున్నట్లుగా మార్గదర్శకాలు జారీ చేస్తూ కేసీఆర్ సంతకం చేశారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.