KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గత కొద్దికాలంగా ఊరిస్తున్న వాటికి రూపం దక్కనుందని తేలింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థికమంత్రి హరీష్రావు మాట్లాడుతూ.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకే ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నామన్న ఆయన.. వయోపరిమితి పెంపు ప్రభావం ఖాళీల భర్తీపై పడబోదని స్పష్టం చేశారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రకటన నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అని అంటున్నారు.
ఎప్పుడు యాభై వేల కొలువులంటే….
తెలంగాణ రాష్ట్రంలో వెంటనే 50 వేల ఖాళీలు భర్తీ చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారని.. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో, చెప్పాలంటే ఏప్రిల్ మాసంలో ఒక్క నోటిఫికేషన్ అయిన రావొచ్చునని నిరుద్యోగులు అంచనా వేస్తున్నారు.
నిరుద్యోగులు నిరాశ పడకుండా….
హాట్ టాపిక్ గా మారిన ఉద్యోగుల పదవీ విరమణ అంశంపై హరీశ్ రావు క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగుల అనుభవాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుందన్న హరీష్రావు.. వయసు పెరిగే కొద్ది.. వారి మరింత అనుభవంతో పనిచేస్తారని తెలిపారు.. ఇక, ఉద్యోగుల జీవన ప్రమాణాలు కూడా పెరిగి.. జీవిత కాలం కూడా పెరిగిందని.. ఇది కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు.. అందరి సంప్రదింపులతోనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందని మంత్రి హరీష్ రావు తెలిపారు.