ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల కుదేలైన వ్యవస్థల్లో విద్యా వ్యవస్థ కూడా ఒకటి. నర్సరీ చదివే పిల్లల నుండి పై చదువులు చదువుతున్న యువతీ-యువకులు, మధ్యవయస్కుల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రైవేటు విద్యాసంస్థల అయితే ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి కానీ అవి కూడా పూర్తిస్థాయిలో కాదు. ఏదో లాగా తల్లిదండ్రుల నుంచి ఫీజులు రాబట్టాలని ఉద్దేశంతో అరకొరగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ నుంచి స్కూళ్ళు ప్రారంభించేందుకు అవుతున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. అయితే తెలంగాణ విద్యా శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చకు నిలిచింది.
విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నుండి స్కూల్లో విషయంపై ఎటువంటి సమాచారం లేకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సెప్టెంబర్ నుండి తాము స్కూళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ విద్యా వ్యవస్థను ప్రస్తుతానికి డిజిటల్ తరగతుల వరకు మాత్రమే పరిమితం చేసేందుకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా ప్రాథమిక తరగతులకు వర్క్ షీట్స్, అసైన్మెంట్స్…. 6 నుండి 10వ తరగతి వరకు వీడియో పాటలు ప్రసారం చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. ఇందుకు సంబంధించి వారు ఎంతో ముందు చూపుతో 900 పైగా డిజిటల్ పాఠాలు పిల్లల కోసం రూపొందించారు.
ఇక మరో వైపు ఏపీ ప్రభుత్వం డిజిటల్ తరగతుల పై అసలు ఎటువంటి వివరణ ఇవ్వకపోగా సెప్టెంబర్ నుండి స్కూళ్ళు తెరుస్తామని పిల్లలు బడికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పడం గమనార్హం. గత రెండు రోజుల్లో ఏపీలో కేసులు 10,000 దాటాయి. పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఈ సమయంలో పిల్లలు స్కూల్ కు వెళ్ళడం అనేది కత్తి మీద సాము వంటిదే. తల్లిదండ్రులు కూడా ఎవరూ ఇందుకు మొగ్గు చూపరు. అయితే తెలంగాణలో మాత్రం కేవలం పల్లెల్లో టీచర్లను రొటేషన్ పద్ధతిలో నుంచి స్కూల్స్ అందుబాటులో ఉంచాలని భావిస్తుండగా జగన్ మాత్రం ఈ విషయమై ఏదో ఒక స్పష్టత ఇస్తే బాగుంటుంది లేదా కేంద్ర ప్రభుత్వం స్కూళ్లు తెరిచే విషయమై పూర్తిగా ఆమోదం తెలిపిన తరువాతే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది.