ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరిగా విజయం సాధించడం జరిగింది. ఇటువంటి తరుణంలో మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా త్రాగునీరు అందించడానికి కేసీఆర్ సర్కార్ రెడీ అయింది.
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని వచ్చే జనవరి మాసం నుండి అమలు చేయటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో వార్తలు వస్తున్నాయి. జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు త్రాగునీరు ఉచితంగా అందించాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఈ మేరకు రెండు రోజుల్లో ఉచిత తాగునీరు విధివిధానాలు గురించి సి ఎస్, జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశం కాబోతున్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా జనవరి మొదటి వారంలో జిహెచ్ఎంసి ఎన్నికలలో హైదరాబాద్ ప్రజలకు ఇచ్చిన ఉచిత నీరు హామీని అమలు చేయటానికి కేటీఆర్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ లో 9,84,000 పైగా పైచిలుకు మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ ఉచిత నీరు అపార్ట్మెంట్ కా, ఒక కుటుంబానికా, ఇండిపెండెంట్ హౌస్ కా అనేది ప్రభుత్వ వర్గాలు తీసుకునే విధానాలు బట్టి రెండు రోజుల్లో తెలుస్తోంది అనే టాక్ వస్తోంది.