భారత ఆర్మీ కి చెందిన కల్నల్ సంతోష్ చైనా సైనికుల తో జరిగిన గొడవలు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు కోట్ల ఆర్థిక సాయం తో పాటు అతని భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మరియు 500 గజాల నివాస స్థలాన్ని కూడా కేటాయించిన విషయం తెలిసిందే.
అయితే కేసీఆర్ మరింత స్ఫూర్తిదాయకంగా తానే స్వయంగా సంతోష్ కుటుంబానికి వెళ్లి తన చేతుల మీదగా ఈ సహాయాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ నుండి సూర్యాపేటకు కెసిఆర్ తన కాన్వాయ్ లో వెళ్లారు.
ప్రస్తుతం సీఎం కాన్వాయ్ తుర్కపల్లి దాటింది. అక్కడి నుంచి భువనగిరి , వలిగొండ, చిట్యాల,నార్కెట్ పల్లి, కట్టంగూర్, నకిరేకల్ మీదుగా సూర్యాపేట కు కాన్వాయ్ చేరుకుంటుంది. సూర్యాపేట లోని విద్యానగర్ లో సంతోష్ బాబు నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి…. సంతోష్ బాబు నివాసం ఏర్పాట్లు ను పర్యవేక్షణ చేశారు..