NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

త‌లొగ్గిన కేసీఆర్ …. సంచ‌ల‌న నిర్ణ‌యం

cm kcr new strategy on settlers

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు. ఇంటా, బ‌య‌ట ఎదుర‌వుతున్న ఒత్తిళ్ల నేప‌థ్యంలో తలొగ్గి నిర్ణ‌యం తీసుకున్నారు. మునుప‌టి విధానంలోనే ముందుకు పోవాల‌ని డిసైడ‌య్యారు.

cm kcr new strategy on settlers

ఇదంతా ఆస్తుల రిజిస్ట్రేష‌న్ గురించి. నేటి నుంచి వ్య‌వ‌సాయేత‌ర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించ‌నున్నారు. కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం ధ‌ర‌ణి వివాదాస్ప‌దం కావ‌డం, అనంత‌ర ప‌రిణామాల ఫ‌లితం.

ఏంటీ వివాదం

ఆస్తుల రిజిస్ట్రేషన్​కోసం రెండు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీ రాజ్​ యాక్టుల్లో సవరణలు చేసింది. ఇది అసెంబ్లీలో ఆమోదం పొందడంతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ లీడర్లు సంబురాలు జరుపుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని చట్టాన్ని కేసీఆర్ తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకున్నారు. అయితే, ధరణి వివాదం కావడంతో తెలంగాణ హైకోర్ట్ విచారణ చేపట్టింది. సర్వేలో అనవసర వివరాలు తీసుకోవడంతో పాటు డేటా సెక్యూరిటీపై అనుమానాలున్నాయని కోర్టు స్టే విధించింది. దీనివల్లే రిజిస్ట్రేషన్లు ఆగాయని సర్కారు చెప్పింది. అయితే రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదనీ, పాత విధానంలో చెసుకోవచ్చని కోర్టు చెప్పింది. దీంతో నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుకు వెళ్లాలో వెనక్కి వెళ్లాలో తేల్చుకోలేకపోయింది.

ట్రెండ్ సెట్ట‌ర్ అన్నారు…. వెన‌క్కు త‌గ్గారు

సీఎం కేసీఆర్ అక్టోబర్​ 29న పోర్టల్ ప్రారంభిస్తూ ‘ధరణి పోర్టల్ ఓ ట్రెండ్ సెట్టర్’ అని ప్రకటించారు. ఇక నుంచి అన్ని రకాల ఆస్తుల క్రయవిక్రయాలు పావుగంటలో జరిగిపోతాయన్నారు. నాన్ అగ్రికల్చర్ ఆస్తుల రిజిస్ట్రేషన్లు ధరణి ద్వారా మాత్రమే జరిపేందుకు ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్ యాక్టులను సవరించింది. ఇందుకోసం అక్టోబర్​ 12, 13 తేదీలో అసెంబ్లీ, మండలిని ప్రత్యేకంగా సమావేశపరిచి సవరణ చట్టాలను ఆమోదించుకుంది. దీంతో ధరణి పోర్టల్ ద్వారా కాకుండా పాత పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయడానికి వీలు లేదు. అయితే ఒకవేళ పాత పద్ధతిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని భావిస్తే.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఫెయిలైనట్లుగా అంగీకరించాల్సి వస్తుందని ప్రభుత్వం భయపడుతోంద‌నే టాక్ ఉంది. అంత గొప్పగా చెప్పిన ధరణి ద్వారా కాకుండా పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరిపితే సర్కారు పరువు పోతుందనే చర్చ జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ, కోర్టు ఆదేశాల‌తో ఆ నిర్ణ‌యాల‌ను మార్చి రిజిస్ట్రేష‌న్లు ఆమోదింప‌చేశారు.

author avatar
sridhar

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju