హైదరాబాదు: ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వామి స్వరూపనంద ఆశీస్సులు తీసుకున్నారు.
విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్కు విచ్చేసిన స్వరూపనందనను కెసిఆర్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంలో ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
జూన్ 15నుంచి మూడు రోజులపాటు విజయవాడలో ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కెసిఆర్కు తెలియజేసిన స్వరూపనంద ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.