కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరింతగా వైరస్ ప్రభావం ఉండటంతోపాటు రాష్ట్రంలో కొత్త పాజిటివ్ కేసులు భయంకరంగా బయట పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేసింది.
ముఖ్యంగా హైదరాబాదు నగరంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టులో లాక్ డౌన్ కి సంబంధించి వచ్చిన పిటిషన్ పై ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని న్యాయస్థానం కోరింది. దీంతో మళ్లీ లాక్డౌన్ పెడతారా ? అని కూడా ప్రశ్నించడం జరిగింది. లాక్ డౌన్ పెడితే ఎలా పరీక్షలు నిర్వహిస్తారు అని హైకోర్టు ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఎజి హైకోర్టుకు తెలిపారు.దానిపై ప్రవేవ పరీక్షల పై అబిప్రాయం చెప్పాలని హైకోర్టు కోరింది. ఆ మీదట ఏజీ ప్రభుత్వంలోని ముఖ్యులతో మంతనాలు జరిపి ప్రవేశ పరీక్షల ఎన్నిటిని వాయిదా వేస్తున్నట్లు తెలపడం జరిగింది. వీటిలో ఎంసెట్ కూడా ఉంది.
ఇక తదుపరి నోటీసులు వచ్చేవరకు ఎటువంటి పరీక్షాలు జరపరాదని తెలంగాణ సర్కారు చెప్పింది. ఈ రకంగా మరో రెండు నెలల వరకు ఎటువంటి పరీక్షలు ఉండనట్లే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?