హైదరాబాద్: నేపధ్యంలో తెలంగాణ సర్కార్ పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోయినా ఇక ఆ వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఏదో విధంగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలని సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎంటర్ అయి కీలక తీర్పు ఇచ్చింది. వైరస్ తీవ్రంగా ఉన్న జీహెచ్ ఎంసీ – రంగారెడ్డి జిల్లాలను వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకో వచ్చని హైకోర్టు సూచించింది. అయితే ఈ నిర్ణయం సరికాదని భావించింది తెలంగాణ సర్కార్. ఆ విధంగా పరీక్షలు నిర్వహిస్తే కొందరికి అన్యాయం జరుగుతుందన్న భావనతో ఇప్పుడు ఏకంగా పదవ తరగతి వార్షిక పరీక్షల రద్దుకు తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఅర్ నేడు సంబంధిత ఉన్నతాధికారులతో భేటీ జరుపనున్నారు. నేటి రాత్రి లోగా ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించే అవకాశాలు కనబడుతున్నాయి.
పదవ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేసి ప్రీ ఫైనల్ పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఆప్ గ్రేడ్ చేసే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ప్రి ఫైనల్) పరీక్షలు ఏడాదిలో నాలుగు నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు నిర్ణయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో ఇదే ఉత్తమ మార్గంగా ప్రభుత్వానికి కనబడుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?