హైదరాబాద్, జనవరి 8: కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల బిల్లులో సవరణలు కోరాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు టిఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో తెలంగాణా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఈ తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. కేంద్రం ప్రవేశ పెట్టిన రిజర్వేషన్ సవరణ బిల్లులో తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపిన అంశాన్ని కూడా చేర్చాలని ఎంపిలకు కెసిఆర్ సూచించారు.
previous post
next post