KCR: తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉత్కంఠకు చెక్ పెడుతూ హుజురాబాద్ అభ్యర్థిని ఖరారు చేశారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. దళిత బంధు ప్రారంభ సమావేశం సందర్భంగా ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పరిచయం చేయనున్నారు.
Read More : KCR: కేసీఆర్కు షాక్ ఇస్తున్న హుజురాబాద్ టీఆర్ఎస్ నేతలు
గెల్లు బ్యాక్ గ్రౌండ్ ఇది..
గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో దీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టీఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెళ్లారు. గెల్లు శ్రీనివాస్ క్రమశిక్షణతో కూడిన వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని, నిబద్దతను గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని పార్టీ పేర్కొంది.
Read More : KCR: హుజురాబాద్కు షాకిచ్చి వాసాలమర్రిలో కేసీఆర్ ఆ మాట ఎందుకు చెప్పారంటే…
గెల్లు పేరు ఖరారు అవడంతో..
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు గులాబీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. యువనేత కు చాన్స్ ఇచ్చారని, ఉద్యమకారుడికి అవకాశం దక్కిందనే సెంటిమెంట్ సొంతం చేసుకునేందుకు ఇలా అభ్యర్థిగా ఖరారు చేశారంటున్నారు. కాగా, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజకీయాల్లో నవతరాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. బీసీ వర్గాలకు అనేక రాజకీయ పదవులు ఇస్తున్నారని తెలిపారు.