Himanshu: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మనుమడు, మంత్రి కేటిఆర్ తనయుడు హిమాన్షుకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 9 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వారికి ఇచ్చే ఈ అవార్డు ఈ ఏడాది హిమాన్షు రావుకి దక్కింది. సమాజంలో మార్పు కోసం మానవీయ దృక్పదంతో చేసే పనులకు ఈ అవార్డు ఇస్తారు. ఈ విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోమా (SHOMA) అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తనకు ఈ అవార్డు వచ్చినట్లు హిమాన్షు చెప్పారు. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే ధిశగా తీసుకువెళ్లడమే లక్ష్యంగా హిమాన్షు ఇటీవల సోమా ప్రాజెక్టు గురించి వివరించారు.
తన నాయనమ్మ శోభా లో మొదటి అక్షరం, తన తల్లి శాలిమ లో చివరి అక్షరం కలిసి వచ్చేలా సోమా అని ప్రాజెక్టు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీసుకువెళ్తానన్నారు. కార్యక్రమం ప్రారంభించిన కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు రావడం సంతోషం గా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి తనకు మార్గదర్శకుడిగా ఉన్న తన తాత, సీఎం కేసిఆర్ కు ఈ సందర్భంగా హిమాన్షు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గంగాపూర్, యూసుఫ్ ఖాన్పల్లి వాసులకు, తన గురువులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. తాత కేసిఆర్, తండ్రి కేటిఆర్ లు ఈ సందర్భంగా హేమాన్షుకు అభినందనలు తెలియజేశారు. హిమాన్షుకు అవార్డు లభించడంపై మంత్రి కేటిఆర్ అభిమానులు ట్విట్టర్ వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.