KCR: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వీరవిహారం చేస్తుండగా అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.కరోనా కట్టడి చర్యలు కానీ సహాయకచర్యలు కానీ తగినట్లుగా లేవని వ్యాఖ్యానిస్తున్నారు.రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు ఓ టీఆర్ఎస్ కార్యకర్త.
కరోనాతో పోరాడుతూ హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలానికి చెందిన కార్యకర్త. తమ మండలాన్ని దత్తత తీసుకుంటానన్న బాల్క సుమన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రతీ కాలనీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. మండలం మొత్తం వెంటనే టెస్టులు చేయాలన్నారు. టెస్టులు ఆలస్యం కావడంతో పాటు.. బెడ్స్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇదేమైనా అక్బర్,బాబర్ కాలమా? అని ప్రశ్నించారు. సర్కార్ మూర్ఖత్వం వీడి టెస్టులు పెంచాలన్నారు. టెస్టులు పెంచకనే కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని అందరూ తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెస్టులు చెయ్యకపోతే.. చావులు తప్పవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ టీఆర్ఎస్ కార్యకర్త విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అయ్యింది
2 రోజులపాటు ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగి శవం ఇంట్లోనే!
ఇకపోతే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం, గడ్డిమున్కంపల్లి గ్రామానికి చెందిన ఉలిగుండం నర్సప్ప (48) కరోనా సోకడంతో తీవ్ర మనోవేదనకు గురై తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సప్పకు ఐదు రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స విషయంలో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంటా బయటా పరిస్థితిని చూసి చలించిపోయాడు. మనోవేదన భరించలేక రెండు రోజుల క్రితం తన ఇంటిలోనే ఉరి వేసుకొని చనిపోయాడు. కరోనా సోకిన విషయం తెలిసినప్పటి నుంచి నర్సప్ప ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. వారు కూడా అతనికి దూరంగా మసలుకోవడంతో వెలివేసినట్లు ఆత్మన్యూనతకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కరోనా భయంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంట్లోనే వదిలేశారు. రెండు రోజులు కావడంతో వాసన రాగా చుట్టుపక్కల వారు వచ్చి అనుమానించి అధికారులకు సమాచారమిచ్చారు.అప్పుడు ఈ ఉదంతం బయటకు వచ్చింది.