అందాల కథానాయిక కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమా కి ముందు హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నప్పటికి ‘మహానటి’ తర్వాత వచ్చిన క్రేజ్ ఇటు టాలీవుడ్ లో గానీ అటు కోలీవుడ్ లో గానీ అసాధారణం. ఈ ఒక్క సినిమా తో కీర్తి సురెష్ సౌత్ లోనే టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది. ఒక వైపు తమిళ డబ్బింగ్ సినిమాలు ‘సామి’, ‘పందెం కోడి2’, ‘సర్కార్’లో కనిపించినా.. తెలుగు చిత్రాల్లో మాత్రం వెనకబడింది. పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత నాయికా ప్రధాన చిత్రాలపై దృష్టి సారించిన కీర్తి అటు బాలీవుడ్లో ఓ చిత్రానికి సంతకం చేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఒక తెలుగు సినిమా కోసం బాలీవుడ్ ప్రాజెక్ట్ ని వదుకుందన్న మాట వినిపించింది.
కాగా కీర్తి సురేష్ డిసెంబర్.. జనవరిలో ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలతో బిజీ కాబోతోంది. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం షూటింగ్ వచ్చే వారం నుండి ప్రారంభించనున్నారట. ఇందులో భాగంగా రజనీ హైదరాబాద్ వచ్చి ‘అన్నాతే’ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ లాంగ్ షెడ్యూల్ తో దాదాపు టాకీ పార్ట్ ని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుండగా కీర్తి జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఇలా ఒకేసారి ఇద్దరు సూపర్ స్టార్ల సినిమాలకి డేట్స్ కేటాయించడం కీర్తి కి కాస్త ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. ఒకపక్క ఇద్దరు సూపర్ స్టార్లతో నటిస్తున్న ఆనందం ఉన్నా కాల్షీట్ల విషయంలో మాత్రం కీర్తి పడుతున్న టెన్షన్ మామూలుగా లేదంటున్నారు. అందుకు కారణం కరోనా వల్ల ఇప్పటికే ఇచ్చిన డేట్స్ అన్ని తారుమారయ్యి మళ్ళీ రెండు ప్రాజెక్ట్స్ కి ఒకేసారి డేట్స్ అడ్జెట్ చేయాల్సి రావడమేనట. చూడాలి మరి రెండు ప్రాజెక్ట్స్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో.