రజనీ మురుగన్, రెమో సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ సరసన నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదిచుకుంది కీర్తి సురేష్. తల్లి మేనక నుంచి అందం అభినయం కలగలిపి తెచ్చుకున్న కీర్తి సురేష్ అతికొద్ది కాలంలోనే స్టార్ హీరోలు నటించే సినిమాలలో అవకాశాలు అందుకుంది. ఇక టాలీవుడ్ లో రాం సరసన నటించిన ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది కీర్తి సురేష్.
ఆ తర్వాత నేను లోకల్.. అజ్ఞాతవాసి సినిమాలు చేసింది. అయితే ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడమే కాకుండా మొత్తం సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదిచుకుంది. సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి కీర్తి సురేష్ కి అసాధారణమైన పాపులారిటీని తెచ్చి పెట్టింది. ఈ సినిమాతో జాతీయ పురస్కారం కూడా సాధించింది. అయితే మహానటి సినిమాకోసం కాస్త బొద్దుగా కావాల్సిన కీర్తి సురేష్ అలాగే తయారైంది.
అయితే ఆ సినిమా తర్వాత కూడా అదే లుక్ లో ఉండటం తో కీర్తి సురేష్ కమిటయిన కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల కోసం సన్నగా తయారవ్వాల్సి వచ్చింది. దాంతో ఈ లాక్ డౌన్ లో బాగా డైట్ మేయిటైన్ చేసి సన్నగా తయారైంది. అయితే మరీ పీలగా ఉందన్న కామెంట్స్ ఇప్పుడు కీర్తికి ఇబ్బందిని కలిగిస్తున్నాయట. ముందే బావుండేదని కాస్త సన్నబడితే సరిపోయేది గాని మరీ ఇలా సన్నగా అంటే చూడటానికి ఏమాత్రం బాగాలేదన్న మాటలు వినిపిస్తున్నాయట.
రీసెంట్ గా కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫొటోలకి నెటిజన్స్ అండ్ ఫ్యాన్స్ బాగా చిక్కిపోయావంటూ కామెంట్స్ పెడుతు ఫీలవుతున్నారట. కీర్తి లుక్ అసలు బాగాలేదాన్న కామెంట్స్ ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.
అయితే ఈ లుక్ మార్చాలని.. ముందుగా ఉన్నట్టుగానే కాస్త బొద్దుగా మారాలని ఫ్యాన్స్ చెబుతున్నారట. అంతేకాదు రీసెంట్ గా సర్కారు వారి పాట టీం కూడా కీర్తి ని కాస్త బొద్దుగా అవ్వాలని సలహా ఇచ్చారట. అందుకే కీర్తి మళ్ళి ఓల్డ్ లుక్ లోకి వచేందుకు ప్రయత్నిస్తూ ఫ్యాన్స్ తో నేనేంటో త్వరలోనే చూడండి అని చెపుబుతుందట.