పవన్ కళ్యాణ్ తో కీర్తి సురేష్ అజ్ఞాతవాసి అన్న సినిమా చేసిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్వకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో కీర్తీ సురేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. 2020 లో వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది కీరి సురేష్. వరుసగా కీర్తి సురేష్ చేస్తున్న మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అయోమయంలో పడిపోయింది. కరోనా టైం లో ఓటీటీ లో రిలీజ్ అయిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మహానటి స్థాయిలో ఏవీ హిట్ సాధించలేకపోవడంతో కథల ఎంపికలో కీర్తి కి క్లారిటీ మిస్ అవుతోందంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారట.
ఇక యంగ్ హీరో ఆదిపినిశెట్టి తో గుడ్ లక్ సఖీ అన్న సినిమాలో నటించింది కీర్తి సురేష్. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. అయితే లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ గా మిగలడం తో ఇప్పుడు గుడ్ లక్ సఖీ సినిమా మీద ఆ ప్రభావం పడినట్టు చెప్పుకుంటున్నారు. కాగా ప్రస్తుతం నితిన్ తో రంగ్ దే సినిమా, మహేష్ బాబుతో సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో కీర్తి సురేష్ మళ్ళీ సూపర్ హిట్స్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాత్ తో మరో సారి నటించే అవకాశం దక్కినట్టు సమాచారం.
అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ – కీర్తి సురేష్ నటించినా ఆ సినిమా ఆ సినిమా ఫ్లాప్ కావడం తో ఈ సినిమా కీర్తికి పెద్ద మైనస్ గా మిగిలింది. అందుకే ఈ సారి మంచి హిట్ ఇవ్వాలన్న ఉద్దేశం తో పవన్ కళ్యాణ్ మళ్ళీ తను నటించబోతున్న లేటెస్ట్ సినిమాలో కీర్తి ని తీసుకోమని మేకర్స్ కి సూచించినట్టు చెప్పుకుంటున్నారు. అయితే అది ఏ సినిమా అన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా ఉంది. ఇదే గనక నిజమైతే కీర్తి సురేష్ లక్కీ అని చెప్పాలి. మరి ఈ సారైనా పవన్ కళ్యాణ్ – కీర్తి సురేష్ ల కాంబోలో హిట్ నమోదవుతుందేమో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?