మహానటి ఫేం కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం పెంగ్విన్. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్తో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిన సంగతి తెలిసిందే. అంతేకాదు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకవేళా లాక్ డౌన్ తొలగించినప్పటికి జనాలు సినిమా థియేటర్స్కు వచ్చి సినిమా చూస్తారా ..? అన్నది అనుమానమే.
అయితే కోట్లు ఖర్చు పెట్టిన నిర్మించిన సినిమాలు మాత్రం రిలీజ్ కావాల్సిందే. లేదంటే నిర్మాత నట్టేట మునిగిపోతాడు. అందుకే అందుకు ప్రత్యామ్నయంగా కొందరు నిర్మాతలు సినిమాలను తాము నిర్మించిన సినిమాలను రిలీజ్ చేసేందుకు ఇతర మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే సూర్య సతీమణి నటించిన పోన్మగల్ వందాల్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఇదే విధయంగా కీర్తి సురేష్ నటించిన ద్విభాషా పెంగ్విన్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో జూన్ 19 న రిలీజ్ చేయనున్నారు. అందుకు తగ్గ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని తాజా సమాచారం. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ బాంబ్ సినిమాని కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?