ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్లు ఇటీవల తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది. కాగా సినిమా హీరోయిన్ విషయంలో అనేక మంది పేర్లు వినబడిన చివరాఖరికి మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.
ఇటీవల సోషల్ మీడియాలో అభిమానుల తో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఈ విషయాన్ని కీర్తి సురేష్ స్వయంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో మినిమం కనికరం లేకుండా పారితోషికం ఎక్కడ తగ్గటానికి కీర్తి సురేష్ ఒప్పుకోవడం లేదట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది హీరోలు హీరోయిన్లు నిర్మాతల రెమ్యూనరేషన్ విషయంలో కొద్దిగా కనికరం చూపిస్తూ తగ్గించుకుంటున్నారు. కానీ మహేష్ సినిమా విషయంలో కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ తగ్గించడం లేదని సమాచారం.