Keerthy Suresh: ప్రముఖ నటి కీర్తి సురేష్ మహానటి సినిమాతో ప్రేక్షకులకు మళ్లీ సినియర్ నటి సావిత్రిని కళ్లకు కట్టినట్లు చూపించింది. తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. బొద్దుగా ఉన్నప్పుడే ముద్దుగా ఉంది ఈ భామ. అయినా కూడా ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్గా కనిపించాలని వెయిట్ లాస్ అయింది. అయితే బరువు తగ్గిన తరువాత గ్లామర్ పెరగడం పక్కనపెడితే అందవిహీనంగా తయారయింది. మొహంలో ఉన్న కల మొత్తం పోగొట్టుకుంది. సర్కారు వారి పాటలో మహేష్తో జంటగా నటించింది కీర్తి సురేష్. ఈ సినిమాలో కీర్తిని ప్రేక్షకులు ఎక్కువ సేపు చూడలేక ఇబ్బంది పడ్డారు. చాలా వరకూ ఆమె మొహాన్ని మేకప్తో కవర్ చేసినా కూడా ఆమె ఫేస్లో కల ఏ మాత్రం కనపడలేదు.
Keerthy Suresh: ఎన్టీఆర్ మూవీని రిజెక్ట్
కీర్తి సురేష్ ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఆఫర్ను రిజక్ట్ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘NTR30’ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్కి ఛాన్స్ వస్తే ఆమె దానిని రిజెక్ట్ చేసిందంట. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం ఎవరికీ తెలీదు. ఇక ఈ విషయం గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘కీర్తి సురేష్ రేంజ్కి ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీని రిజెక్ట్ చేసేంత సీన్ ఉందా?’ అని కామెంట్స్ చేస్తున్నారు.
సిల్లీ రూమర్
గతంలో కీర్తి, పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్లాప్ అయింది. తరువాత కోలీవుడ్లో కూడా వరుస ప్లాప్స్ అందుకుంటున్న సమయంలో మహేష్ ఆమెకి సర్కారు వారి పాట సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. దాని తరువాత కీర్తికి టాలీవుడ్లో ఏ ఒక స్టార్ హీరో అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి నటించడానికి ఛాన్స్ వస్తే కీర్తి నిజంగానే రిజెక్ట్ చేసిందా? లేకపోతే ఇదంతా రూమర్ మాత్రమేనా? అనేది తెలియాల్సి ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!