కీర్తి సురేష్ అంటే మహానటి సినిమాకి ముందు ఆ తర్వాత అన్న క్రేజ్ దక్కించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలల్లోనే ఆఫర్లు వస్తున్నాయి. ఒక వైపు ఆ సినిమాలని ఒప్పుకుంటూనే మరో వైపు సూపర్ స్టార్స్ సినిమాలలో అవకాశం వస్తే ఒదిలి పెట్టడం లేదు. కథ లో పాత్రకి, నటనకి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అంతేకాదు స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేస్తూ కీర్తి సురేష్ సౌత్ సినిమాలలో బిజీ హీరోయిన్ గా ఉంది.
ఈ నేపథ్యంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ హీరో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్న ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తుంది. ‘వెట్టయ్యాడు విలైయ్యాడు’ సినిమాకి సీక్వెల్ గా ‘వెట్టయ్యాడు విలైయ్యాడు 2 రాబోతుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. తెలుగులో రాఘవన్ గా విడుదలై మంచి వసూళ్ళు రాబట్టింది. 2006లో వచ్చిన ఈ సినిమాకే ఇప్పుడు దర్శకుడు గౌతమ్ మీనన్ సీక్వెల్ చేయబోతున్నాడట. వాస్తవంగా ఈ సినిమాలో ముందు అనుష్క శెట్టి ని అనుకున్నప్పటికి క్రేజ్ దృష్ఠ్యా హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.
కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలతో పాటు ప్రస్తుతం చేస్తున్న మహేష్ బాబు, రజినీకాంత్ ల సినిమాలు పూర్తి అయిన తర్వాతే కమల్ హాసన్ సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా వచ్చిన అతి తక్కువ సమయంలోనే కీర్తి సురేష్ సౌత్ లో దాదాపు స్టార్ హీరోల అందరితోను నటించించే అవకాశాలను అందుకుంటుందని చెప్పాలి. ఇక కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా త్వరలో ఓటీటీలో రిలీజ్ కి రెడీ అవుతుండగా తెలుగులో నితిన్ నటిస్తున్న రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా కీర్తి నటిస్తుసంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!