సర్కారు వారి పాట హీరోయిన్ గా మహానటి తో సౌత్ మొత్తం క్రేజ్ ని తెచ్చుకున్న కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించబోతున్న 27 వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక మోసాల చుట్టూ కథ సాగుతుంది. మహేష్ బాబు కోసం పాన్ ఇండియన్ సినిమా చేయాలనుకున్న దర్శకుడు పరశురాం ఈ యూనివర్సల్ పాయింట్ ని ఎన్నుకున్నాడు.
జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ – మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సర్కారు వారి పాట కోసం భారీ బ్యాంక్ సెట్ నిర్మించారు. ఈ బ్యాంక్ సెట్ లో సర్కారు వారి పాట మొదలవబోతోంది. ఫస్ట్ షెడ్యూల్ లో నెల రోజులకి పైగా షూటింగ్ జరపనున్నారట. ఆ తర్వాత అమెరికాలో 45 రోజుల భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు దర్శక, నిర్మాతలు. ఈ షెడ్యూల్ తో దాదాపు గా సర్కారు వారి పాట కంప్లీట్ అవుతుందట.
ఈ సినిమా గత నెలలో ఓపెనింగ్ పూజా కార్యక్రమాలని ఘనంగా నిర్వహించారు. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి mahesh babu అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే keerthy suresh విషయంలో mahesh ఫ్యాన్స్ నుంచి కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఆమధ్య keerthy suresh బాగా సన్నబడింది. చూడటానికి అసలు బాగాలేకపోవడంతో ఇలానే గనక సర్కారు వారి పాటలో mahesh పక్కన కనిపిస్తే సినిమాకి మైనస్ అవుతుందని చెప్పారట. దాంతో మళ్ళీ keerthy suresh బాగా నచ్చినవన్నీ లాగించేసి బొద్దుగా తయారైందట. ఇప్పుడు keerthy suresh చాలా అందంగా ఉందని చెప్పుకుంటున్నారు.