టాలీవుడ్ తో సహా కోలీవుడ్ లోను ప్రస్తుతం మంచి క్రేజ్ ని సంపాదించుకుంది కీర్తి సురేష్. ఇండస్ట్రీలో నెలకొన్న ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా కీర్తి సురేష్ కి వరసగా భారీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎక్కువ ప్రాజెక్టు లతో తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తుంది కీర్తి సురేష్. అజ్ఞాతవాసి వంటి భారీ ఫ్లాప్ తర్వాత మళ్ళీ కీర్తి సురేష్ కనిపించదని ఒక దశలో వినిపించింది.
కాని కాస్త గ్యాప్ తో వరసగా సినిమాలు కంటిన్యూ అయి అందరికీ షాకిచ్చింది. ఒకవైపు నితిన్ లాంటి యంగ్ హీరోలతో జత కడుతూనే మరోవైపు రజనీకాంత్ లాంటి సీనియర్ హీరోల సినిమాలు ఒప్పుకుంటుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మిస్ ఇండియా’.
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఓటిటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ కి మిస్ ఇండియా సినిమాని భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మిస్ ఇండియా మేకర్స్ ఇప్పటివరకు ఈ సినిమాని ఎవరికీ అమ్మలేదట. ప్రస్తుతం ఈ సినిమా మీద వస్తున్నవన్ని రూమర్స్ అని మేకర్స్ క్లారిటి ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించాడు. మహిళల పై జరుగుతున్న దాడుల ఆధారంగా ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, పూజిత పొన్నాడ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవబోతున్నాయని సమాచారం. ఇక రీసెంట్ గా కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!