Chiranjeevi: అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్ హీరోయిన్ కీర్తి సురేష్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రలో కీర్తి సురేష్ నటించిన నటనకి రాజకీయ నాయకులతో పాటు యావత్ దక్షిణ భారతదేశ చలనచిత్ర రంగ ప్రముఖులు శభాష్ అన్నారు. ఆ తరహాలో తన నటనతో మెప్పించిన కీర్తి సురేష్ తర్వాత అనతికాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన భారీ అవకాశాలు దక్కించుకోవడం జరిగింది.
కుర్ర హీరోలతో పాటు స్టార్ హీరోలతో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం దక్కించుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. విషయంలోకి వెళితే తమిళంలో అజిత్ నటించిన వేదాళం సినిమాని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్ర లో కీర్తి సురేష్ నీ సినిమా యూనిట్ ఓకే చేసినట్లు చిరంజీవి.. నిర్ణయంతోనే మెహర్ రమేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో హీరో చెల్లెలు పాత్ర సినిమాకి చాలా కీలకం.
ఈ నేపథ్యంలో సరిగ్గా చిరంజీవి చెల్లెలు కు తగ్గ రీతిలో కీర్తి సురేష్ క్రేజ్ సరిపోతుందని.. డైరెక్టర్ డిసైడ్ అవ్వడం జరిగిందట. అక్టోబర్ మాసం నుండి.. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలనీ పక్క షెడ్యూల్ తో ముందుకు వెళ్లాలని చిరు డైరెక్టర్ కి కఠిన ఆదేశాలు ఇచ్చినట్లు ఫిలిం నగర్ టాక్.