YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంలో.. అప్పట్లో రైతు భరోసా కేంద్రాలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు సూచనలు సలహాలు అదే రీతిలో పెట్టుబడి ఖర్చులు రైతు కు తగ్గేలా గిట్టుబాటు ధర పంట కు వచ్చేలా అనేక సలహాలు సూచనలు.. ఆర్ బికే ల ద్వారా ఇస్తూ ఉన్నారు. పంట రుణాలు ఇన్సూరెన్స్ కూడా రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహా సేవలు కేరళ ప్రభుత్వం… తమ రాష్ట్రంలో ఉండే రైతులకు అందించాలని డిసైడ్ అయింది. ఇందుకుగాను ఇటీవల కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వి ప్రసాద్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయసహకారాలు.. ఏపీ ప్రభుత్వానికి కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఏపీలో తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల వైపు దేశం మొత్తం చూస్తుందని.. కూడా ప్రశంసించారు. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం ఇటీవల.. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు లోని రైతు భరోసా కేంద్రాన్ని.. సందర్శించడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా.. రైతులకు ఎటువంటి వ్యవసాయ సేవలు అందుతున్నాయి అన్ని పరిశీలించడం జరిగింది. ఎరువులు విత్తనాల కోసం ఆర్డర్ పెట్టే కియోస్క్ యంత్రాన్ని.. చూసిన కేరళ మంత్రి ఇదేంటి అచ్చం ఏటీఎంల ఉంది.. అని ప్రశ్నించగా విత్తనాలు ఎరువులను బుక్ చేసుకోవడానికి దీనిని.. రైతులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పడంతో.. కేరళ మంచి ఆశ్చర్యపోయారట.
నిజంగా జగన్ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుందని.. కొనియాడారు అట. ఈ తరుణంలో వ్యవసాయం అనుబంధ రంగాలకు.. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిందని.. విత్తనం దగ్గరనుంచి ఎరువులు..పురుగు మందుల తో సహా పంటలకు గిట్టుబాటు ధర.. ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా.. న్యాయం చేయటం…గొప్ప ఆలోచన అని కొనియాడారు. ఏదిఏమైనా దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు అభినందనీయమని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ కొనియాడారు.