పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. అందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేందుకు వివిధ స్కీమ్స్, ఛార్జింగ్ స్టేషన్ నిర్మాణాలతో మద్దతు తెలుపుతున్నాయి ..ఈ ఎలక్ట్రిక్ వాహనాల నిర్వహణ వ్యయం కూడా తక్కువే.. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు డీజిల్ వాహనాల వినియోగిస్తున్నాయి.. తాజాగా ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం టాటా నెక్సన్ 45 యూనిట్ల ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసింది.. దీని వలన పర్యావరణం హితంతో పాటు నిర్వహణం వ్యయం కూడా తగ్గిస్తూ.. అటూ పర్యావరణానికి, ఇటూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది.. పూర్తి వివరాలు..
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్ చౌకైనా ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కార్ల కేరళ ప్రభుత్వం అనేక విభాగాల ఉపయోగ కోసం కొనుగోలు చేసింది. ఈ కారును కేరళ రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఉపయోగిస్తున్నారు. కేరళ రాష్ట్రంలో ఇంతకుముందు టయోటా ఇన్నోవా, మహేంద్ర బొలెరో, సుజుకిgypsy కార్లను ఉపయోగించిన అధికారులు ఇప్పుడు టాటా నెక్సన్ ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తున్నారు . ఈ ఎలక్ట్రిక్ కార్లు నూతన తరానికి చెందిన అత్యాధునిక ఫీచర్లు తో పొందుపరిచారు. ఈ ఎలక్ట్రిక్ కారు తో కేరళ ప్రభుత్వ అధికారులు ఏం చేయాలనుకుంటున్నారో తెలియజేసే ఒక వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.
టాటా నెక్సన్ టీవీ క్లచ్ లేని ఆటోమేటిక్ కారు. ఈ కారణంగా అధికారులు రోజుకు సగటున 100 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తారు. ఈ కారులో 30.2 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ని అమర్చారు. ఇది 312 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది 127 బి హెచ్ పి శక్తిని , 245 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.13.99 లక్షలు. ఈ కారు ఎక్స్ఎమ్,ఎక్స్ఎమ్ ప్లస్, ఎక్స్జెడ్ ప్లస్ మోడల్స్ లో లభిస్తుంది.