Old women: సాధించాలనే తపనా, ప్రతిభ ఉంటే వయసుతో పనిలేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. తాజాగా కేరళ బామ్మ కూడా ఇదే నిరూపించి చూపెట్టింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన లిటరసీ టెస్టులో 100 89 మార్కులు సాధించి అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
Viveka Murder Case: వివేకా హత్య కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు..?
వయసులో సెంచరీ కొట్టి కూడా..
మనలో చాలా మంది మూడు పదుల వయసు వచ్చిన తర్వాతనే చదివేందుకు అనాసక్తి చూపిస్తారు. కానీ కేరళకు చెందిన 104 సంవత్సరాల బామ్మ కుట్టియమ్మ కేరళ గవర్నమెంట్ నిర్వహించిన లిటరసీ పరీక్షలో డిస్టింక్షన్ లో పాస్ అయింది. దీంతో కుట్టియమ్మ నాలుగో తరగతి పరీక్షలు రాసేందుకు అర్హత సాధించింది. ఈ వయసులో కుట్టియమ్మ ప్రతిభను చాలా మంది ప్రశంసిస్తున్నారు.
Municipal Election Results: నెల్లూరులో వైసీపీ స్వీప్.. ! కొండపల్లిలో బిగ్ ట్విస్ట్..! అది ఏమిటంటే..?
మెచ్చుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్
కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివన్ కుట్టి కుట్టియమ్మ ప్రతిభను మెచ్చుకున్నారు. 104 సంవత్సరాల బామ్మ కేరళ లిటరసీ పరీక్షలో 100కు 89 మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రతిభ ఉంటే వయసు అడ్డం కాదని ఆయన తెలిపారు. కుట్టియమ్మ తన జీవితంలో ఒక్కసారి కూడా స్కూలుకు వెళ్లలేదు. కేరళ ప్రభుత్వం నిర్వహించే లిటరసీ స్కూలుకు ఆమె వెళ్లి తను విద్యను అభ్యసించారు. కేరళ ప్రభుత్వం తమ రాష్ర్టంలో ఎడ్యుకేషన్ ను రేటును పెంచేందుకు లిటరసీ స్కూళ్లను నిర్వహిస్తోంది. ఈ స్కూలు ద్వారా 4, 7, 10, 11, 12 తరగతులకు సమానమైన పరీక్షలను నిర్వహిస్తుంది. ఇలా నిర్వహించిన పరీక్షల్లో కుట్టియమ్మ 89 మార్కులు సాధించి ఔరా అనిపించింది. మరో విషయం కుట్టియమ్మకు సరిగ్గా చెవులు కూడా వినిపించవు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లను గట్టిగా మాట్లాడాలని ఆమె కోరిందట. కానీ పరీక్షలో మాత్రం ఇరగదీసింది. ఎంతైనా కుట్టియమ్మది చాలా గ్రేట్ కదా.. 104 సంవత్సరాల వయసులో తనకున్న పట్టుదకు సెల్యూట్ చేయాల్సిందే.