Kesineni Nani : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా టీడీపీ పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తున్నారు ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా వైసీపీ యువనేత దేవినేని అవినాష్ పై సీరియస్ వ్యాఖలు చేశారు.
అప్పట్లో చంద్రబాబు కుక్కల సింహాచలం ఎక్కించినట్లు అవినాష్ కి తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చారని… దీంతో అప్పట్లో చంద్రబాబు మరియు లోకేష్ చిత్రపటాలకు అవినాష్ పాలాభిషేకం చేసేవారిని, ఎప్పుడైతే టిడిపి ఓడిపోయిందా పార్టీ మారి స్వార్థ రాజకీయాలకు పాల్పడి అధ్యక్షపదవిని తాకట్టుపెట్టి మరొకరికి పాలాభిషేకం చేస్తున్నాడు అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు. లేక మనలో విజయవాడలో రౌడీయిజం గూండాఇజం చేయడానికి పాత రోజులు కాదని ఇలాంటివి చిన్ననాటే చూడటం జరిగింది అని తెలిపారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినందుకు దేవినేని నెహ్రూ నియోజకవర్గంలో ఓటర్లను కొట్టించాడు. ఇప్పుడు అదే రీతిలో టిడిపి మహిళా అభ్యర్థిని పోటీ చేయవచ్చు దేవినేని అవినాష్ దాడి చేయించారని కేశినేని నాని ఆరోపించారు. అవినాష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని వార్నింగ్ ఇచ్చే రీతిలో కేశినేని నాని ఇటీవల తెలిపారు. 37 వ డివిజన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాని.. గత 20 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో అభివృద్ధి అనే మాట లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రజలంతా అధిక ధరల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇదే తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటిపన్ను రూపాయి కూడా పెంచే ప్రసక్తి ఉండదని నగర వాసులకు హామీ ఇచ్చారు.