కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఆందోళన 14వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా వేలాది మంది రైతులు ఢిల్లీ – హరియానా సరిహద్దులోని సింఘు, టిక్రీ రహదారులపై తమ నిరసనను కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు నిన్న చేపట్టిన భారత్ బంద్ విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కేంద్ర అమిత్ షా మొదటి సారిగా రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు చట్టాలను రద్ద చేయడం సాధ్యం కాదనీ, అయితే సవరణలు చేపట్టేందుకు మాత్రం తాము సుముఖంగా ఉన్నట్లు షా తెలిపారు.
ప్రభుత్వ ప్రతిపాదనలు తిరస్కరణ
బుధవారం ఉదయం కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రతిపాదనలను లిఖితపూర్వకంగా రైతు సంఘాలకు పంపింది. అందులో ఏపిఎంసీలపై రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా సవరణ, ఏపిఎంసీల్లో ఒకే పన్ను విధానం, ప్రైవేటుతో పాటు ప్రభుత్వం కూడా పంట సేకరణ చేసేలా నిబంధనల్లో మార్పు, ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేయడం, ప్రైవేటు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఒప్పంద వ్యవసాయంలో రైతుల భూముల రక్షణ కల్పించేలా నిబంధనలు, వ్యాపారులు రైతుల, ఒప్పంద వివాద పరిష్కారంలో ఎన్ డీఎంల అధికారాల సవరణ, ఒప్పంద వ్యవసాయంలో సివిల్ కోర్టును ఆశ్రయించేందుకు వీలు. ఈ అంశాలపై రైతు సంఘాల మధ్య తర్జన భర్జన జరిగింది. కొన్ని సంఘాలు ప్రభుత్వ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా కొన్ని సంఘాలు సానుకూలత ప్రదర్శించినట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయిలో రైతు సంఘాల నేతల వీటిపై చర్చలు జరిపిన అనంతరం ఏకగ్రీవంగా ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించడంతో పాటు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలు కార్పోరేట్ సెక్టార్లకు లబ్ది చేకూర్చే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.
నిరసనలు ఉదృతం
నిరసన కార్యక్రమాలను ఉదృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వంతో ఇక చర్చలకు వెళ్లేది లేదని తెలిపాయి. ఈ క్రమంలో భాగంగా తమ కార్యాచరణ ప్రకటించాయి. వీటిలో ప్రధానంగా జియో సిమ్ నుండి మొదలు పెట్టి రిలయన్స్, ఆదానీ, అంబానీ తదితర కార్పోరేట్ ఉత్పత్తుల బహిష్కరణ, దేశ వ్యాప్తంగా బీజెపీ నేతల ఘోరావ్, ఈ నెల 12న ఢిల్లీ – జైపూర్ రహదారి దిగ్బంధం, 14న దేశ వ్యాప్తంగా ధర్నాలు, ఢిల్లీ రహదారులు అన్ని బంద్, రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాల్లో కూడా ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?