రాజమౌళి ని బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత దర్శక ధీరుడు అని గొప్పగా పిలిచుకుంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి రెండు భాగాలతో తెలుగు సినిమా సత్తా చాటి కీర్తి పతాకాన్ని ఎగరవేశాడు. హాలీవుడ్ సినిమాలకి మన తెలుగు సినిమా ఏమాత్రం తక్కువ కాదు.. ఎందులోనూ తీసిపోదు అని నిరూపించాడు. ఇక bahubali సినిమాల వసూళ్ళ తో చరిత్ర సృష్టించాడు. దాంతో rajamouli లాంటి దర్శక ధీరుడు మళ్ళీ ఇప్పట్లో సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాడని అందరూ చెప్పుకున్నారు. ఇక rajamouli మరో ప్రతిష్టాత్మకమైన సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం rajamouli ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చి లేదా ఏప్రిల్ వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఎట్టి పరిస్థితుల్లో జూన్ లేదా జూలై లో ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేయాలని rajamouli కసితో ఉన్నాడు. డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కొమురం భీమ్.. రామ్ చరణ్ అల్లూరి ల పాత్రలకు సంబంధించిన టీజర్ లు విడుదలైన సంగతి తెలిసిందే. ఆ రెండు టీజర్ లు సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా నుండి త్వరలో మరో టీజర్ రిలీజ్ చేసేందుకు rajamouli బృందం సన్నాహాలు చేస్తున్నారు.
అందుకోసం ఈ నెల 26 న డేట్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ టీజర్ లో కొమురం భీమ్, అల్లూరి పాత్రలు కలిసి ఉంటాయని ..మెగాస్టార్ చిరంజీవి ఈ టీజర్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారని జోరుగా ప్రచారం అవుతోంది. ఇదంతా అలా ఉంచితే తాజాగా రిలీజైన కేజీఎఫ్ ఛాప్టేర్ 2 టీజర్ చూసిన నందమూరి అభిమానులు, మెగా అభిమానులు ఈ టీజర్ కంటే భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ఉండాలని ఆశిస్తున్నారు. అంతేకాదు కేజీఎఫ్ ఛాప్టర్ 2 తర్వాత ఆర్ఆర్ఆర్ మీద అంచనాలు ఊహించని విధంగా పెరిగాయి. దాంతో rajamouli కి టెన్షన్ పట్టుకుందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ టీజర్ విషయంలో అంచనాలు తప్పితే ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.