కేజీయఫ్ ఛాప్టర్ 1 సినిమాతో దర్శకుడిగా ప్రశాంత్ నీల్ ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. జనాలలో ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఊహించని విధంగా సక్సస్ ని అందుకొని వసూళ్ళ సునామీని సృష్ఠించింది.
కేజీయఫ్ ఛాప్టర్ 1 సంచలన విజయం అందుకోవడంతో వేరే ఆలోచనే లేకుండా సీక్వెల్ ని రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే కేజీయఫ్ చాప్టర్ 2 సిద్దమవుతోంది. కాగా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే సంజయ్ దత్ అధీరా ఫస్ట్ లుక్ సినిమా మీద భారీగా అంచనాలను పెంచేసింది.
అయితే ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్, బెంగళూరు, మంగళూర్ లలో చిత్రీకరణ జరపబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన మేకర్స్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారట. కాగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో భారీ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ నిర్మించనున్నారు. అయితే ఈ మధ్యలో ప్రభాస్ తోను ప్రశాంత్ నీల్ ఒక ప్రాజెక్ట్ చేయనున్నాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ప్రభాస్ బర్త్ డే కి ఈ కాంబినేషన్ మీద అఫీషియల్ న్యూస్ రానుందని ప్రచారం జరుగుతోంది.
అయితే ప్రశాంత్ నీల్ ఈ విషయంలో క్లారిటి ఇచ్చాడు. కాని అటు ప్రభాస్ ఫ్యాన్స్, ఇటు తారక్ ఫ్యాన్స్ కి షాకిస్తూ కే.జి.ఎఫ్ సినిమా కంప్లీటయ్యాకే ఈ ఇద్దరిలో ఎవరితో నెక్స్ట్ సినిమా ఉంటుందో వెల్లడిస్తానని తేల్చిపారేశాడు. దాంతో ఫ్యాన్స్ కి నరాలు తెగిపోయే ఉత్కంఠత పెరిగిపోతోందట. ఇక ప్రభాస్ ఇప్పటికే 3 భారీ పాన్ ఇండియన్ సినిమాలు కమిటవగా ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసి తర్వాత త్రివిక్రం తో ఒక సినిమా చేయనున్నాడు.