Khiladi : మాస్ మహారాజా రవితేజ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అయిన ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. ఇదే కాదు టాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా ఎంతగానో దెబ్బ తినింది. ఇండస్ట్రీకి సమ్మర్ సీజన్ చాలా కీలకం. కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అలాంటిది వరుసగా రెండు సమ్మర్ సీజన్స్ ని దెబ్బ కొట్టింది కరోనా మహమ్మారి. దాంతో ఈ రెండేళ్ళలో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అధిగమించడానికి కనీసం ఓ రెండేళ్ళైనా పడుతుందని సినీ పెద్దలు అంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కొవిడ్ కాస్త సద్దుమణుగుతోంది. అందుకే మళ్లీ షూటింగులకు సిద్ధమవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీ సహా మిగాతా సినిమా ఇండస్ట్రీస్.
ఇక ఈ సమ్మర్ సీజన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో మాస్ రాజా రవితేజ ‘ఖిలాడి’ కూడా ఉంది. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం మే 29న రిలీజ్ కావాలి. కానీ, థియేటర్లు క్లోజ్ అవడంతో..షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉండడంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. కాగా తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఖిలాడి సినిమా వర్క్ షూటింగ్ ని మళ్ళీ స్టార్ట్ చేసేందుకు యూనిట్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే 80 శాతానికిపైగా షూట్ కంప్లీట్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం.
Khiladi : దుబాయ్ లోనే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట
విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, చిన్న షెడ్యూల్ హైదరాబాద్ లో చేయనున్నారట. ఆ తర్వాత ముఖ్యమైన షెడ్యూల్ కోసం దుబాయ్ బయలుదేరనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందట. మొత్తానికి దుబాయ్ లోనే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టనున్నారట యూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అర్జున్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.