Kiara Advani: తెలుగులో ‘వినయ విధేయ రామ’, ‘భరత్ అనే నేను’ అనే రెండు సినిమాలతో కియారా అద్వానీ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ తార మహేశ్ మూవీతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తో కలిసి RC15 సినిమాలో యాక్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అమ్మడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రతో ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం గురించి వారిద్దరూ ఎన్నడూ స్పందించలేదు కానీ బాలీవుడ్ మీడియా మాత్రం వీరి మధ్య ప్రేమ ఉందని బలంగా చెబుతోంది.
Kiara Advani: సీక్రెట్ వెడ్డింగ్
రీసెంట్గా కరణ్ జోహార్ షోలో సందడి చేసిన కియారా తన ప్రేమ వ్యవహారం గురించి ఇన్డైరెక్ట్గా కొన్ని విషయాలు చెప్పింది. ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే 2023 లో కియారా అధ్వాని, సిద్ధార్థ్ మల్హోత్ర వివాహం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా వారిద్దరూ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వలె సీక్రెట్ గా పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. కియారా, సిద్ధార్థ్ మల్హోత్రల కుటుంబాలు వీరి వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏప్రిల్ 2023లో ఒక ప్రైవేట్ వేడుకలో వీరి పెళ్లి జరుగుతుందని ఒక రిపోర్ట్ పేర్కొంది.
సీక్రెట్గా ఉంచలేమంటూ కామెంట్స్
వీటిపై తాజాగా స్పందించిన సిద్ధార్థ్ మల్హోత్ర.. తను ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నా ఎప్పుడో ఒకరోజు ఈ విషయం కచ్చితంగా బయటికి వస్తుంది అంటూ ఫన్నీగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.