బాలీవుడ్ లో ఇప్పుడు బిజియెస్ట్ హీరోయిన్ అంటే కియారా అద్వాని నే. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా హిందీ సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉంది. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ సక్సస్ అదుకుంది. డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకొని మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఒక్క తెలుగు సినిమాలో నటించలేదు.
అయితే బాలీవుడ్ లో మాత్రం భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది. రీసెంట్ గా అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ లో నటించింది కియారా అద్వానీ. సౌత్ లో భారీ సక్సస్ అందుకున్న కాంచన సినిమాకి రీమేక్ గా లక్ష్మీ బాంబ్ తెరకెక్కింది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఇక ప్రస్తుతం ఇందూ కి జవానీ, భూల్ భూలయ్య2 సినిమాలో నటిస్తోంది.
తాజాగా వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోను కియారా నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించనుండగా రాజ్ మెహతా దర్శకత్వం వహించనున్నాడట. అలాగే తెలుగులో మహేష్ బాబు సర్కారు వారి పాట కి, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సంప్రదిస్తున్నారని లేటెస్ట్ న్యూస్. మరి ఈ మూడు ప్రాజెక్ట్స్ కి గనక కియారా డేట్స్ అడ్జెస్ట్ చేస్తే కియారా మొత్తం సౌత్ అండ్ నార్త్ లో నంబర్ వన్ హీరోయిన్ గా పాపులర్ అవడం ఖాయం.