కీర్తి సురేష్.. మహానటి సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సాధించింది. టాలీవుడ్ లో ఇప్పుడు అందరికంటే ఎక్కువ సినిమాలు చేయడమే కాదు మేకర్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ఇప్పటికే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, అన్నాత్తే, రంగ్ దే సినిమాలు చేతిలో ఉండగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాటలో హీరోయిన్ గా నటిచబోతుందని సమాచారం.
అలాగే రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించిన ప్రాజెక్ట్స్ లో ఒక ప్రాజెక్ట్ కి కీర్తి ని మేకర్స్ అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసిన కీర్తి.. మరోసారి ఈ కాంబో సెట్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నితిన్ తో రంగ్ దే సినిమా చేస్తున్న కీర్తి నితిన్ నటించబోయే మరో సినిమాలోను కీర్తి పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక తమిళం లో కూడా కొన్ని సినిమాల కోసం కీర్తి ని సంప్రదిస్తున్నారు మేకర్స్. డేట్స్ ఇస్తామంటే తమ ప్రాజెక్ట్ ని కొన్నాళ్ళు ఆపడానికి కూడా సిద్దంగా ఉన్నారట. మొత్తానికి కీర్తి సురేష్ టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో ఇలా స్టార్ డం సంపాదించుకుంందంటే మహానటి సినిమా వలనే అని చెప్పుకుంటున్నారు.
ఇక కియారా అద్వానీ కూడా బాలీవుడ్ లో పాపులారిటీ సాధించింది. ఈ బ్యూటికి బాలీవుడ్ లో ఇప్పుడున్న క్రేజ్ మరే హీరోయిన్ కి లేదనే చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ అనుకుంటే ముందు కియారా నే సంప్రదిస్తున్నారట. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమాతో ఎంట్రీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేయడానికి కుదరలేదు. వరస ప్రాజెక్ట్స్ తో బాలీవుడ్ నుంచి బయటకు రాలేకపోతుంది. ఇందూకి జవాని త్వరలో రిలీజ్ కాబోతుంది.
కాగా ఇప్పుడు కీర్తి, కియారా ల మధ్య గట్టి పోటీ నెలకొందని అంటున్నారు. వాస్తవంగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకి కీర్త్ తో పాటు కియారా ని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా ప్రభాస్ నటించబోతున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ లో సీత పాత్ర కోసం కీర్తి, కియారా ల పేర్లే మేకర్స్ పరిశీలిస్తున్నారట. ఇద్దరికీ మంచి డిమాండ్ ఉండటంతో ప్రభాస్ ని అడిగితే ఎవరిని సజెజ్ చేయాలో తెలియక డైలమాలో ఉన్నాడట. మరి ఫైనల్ గా సీత పాత్ర ఎవరిని వరిస్తుందో చూడాలి.