Kiara advani : బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న కియారా అద్వానీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. హిందీలో ఏ కొత్త ప్రాజెక్ట్ మొదలవుతున్నా ముందు మేకర్స్ కియారా అద్వానీ పేరునే పరిశీలిస్తున్నారు. ఆమె నో అంటేనే మరో హీరోయిన్ పేరు పరిశీలిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ భారీ ప్రాజెక్ట్ కియారా అద్వానీ కాదనిందని టాక్ వినిపిస్తోంది. తెలుగులో రాజమౌళి – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతి సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనుంది. ఎప్పటి నుంచో వినాయక్ హిందీ సీమలో ఎంటరవ్వాలనుకుంటున్నాడు. అది ఈ సినిమాతో కుదిరింది. ఇద్దరికీ తెలుగు ఛత్రపతి బాలీవుడ్ డెబ్యూ సినిమా కాబట్టి ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఘనంగా ప్రారంభమవగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా ప్రారంభోత్సవానికి రావడం విశేషం. అయితే తెలుగు సినిమాను హిందీలో ఎంతవరకు సక్సెస్ చేస్తారో అనే కామెంట్స్ కూడా ఉన్నాయి.
Kiara advani : రెజీనా ఇప్పుడు తమిళంలో 6 సినిమాలు చేస్తోంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనేది గత కొంతకాలంగా ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏ సినిమా చేసినా స్టార్ హీరోయిన్స్తోనే ఆడిపాడాడు. అలాగే బాలీవుడ్ ఛత్రపతి రీమేక్ కోసం హిందీలో స్టార్ హీరోయిన్స్ అయిన ఆలియా భట్, కియారా అద్వానీ లాంటి వారిని తీసుకోవాలనుకున్నారట. కానీ వారెవరూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జంటగా నటించేందుకు ఆసక్తి చూపించలేదని చెప్పుకుంటున్నారు. దాంతో ఈ సినిమాలో హీరోయిన్గా రెజీనాని తీసుకోవాలనుకుంటున్నారట. రెజీనా ఇప్పుడు తమిళంలో 6 సినిమాలు చేస్తోంది. తెలుగులో ఒక సినిమా చేస్తోంది. మరీ ఈ సినిమాకి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?