రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో కిడ్నాప్ కు గురైన యువతి డాక్టర్ వైశాలిని రక్షించిన పోలీసులు ఆమెను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి పరారీలో ఉండగా, అతనికి సహకరించిన వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో నవీన్ రెడ్డి తనను ఎంత ఇబ్బందులకు గురి చేసింది వివరించడంతో పాటు అతను చేసిన తప్పుడు ప్రచారాలపై వివరణ ఇచ్చారు వైశాలి. నవీన్ రెడ్డి తనకు మధ్య ప్రేమ ఏమీ లేదనీ, కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందన్నారు. తమకు పెళ్లి జరగలేదనీ, నవీన్ రెడ్డి తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారాలు చేశాడని ఆరోపించారు. నవీన్ రెడ్డి తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పినట్లు వెల్లడించింది. కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వాళ్లు తన పట్ల ఘోరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కారులో తన పట్ల దారుణంగా వ్యవహరించారంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది వైశాలి. అతను తమకు పెళ్లి జరిగిందని చెపుతున్న తేదీ నాడు ఆర్మీ ఆసుపత్రిలో తాను డెంటల్ ట్రీట్మెంట్ లో ఉన్నానని తెలిపారు. తాను గతంలోనే వేధింపులకు గురి చేస్తున్నట్లుగా నవీన్ రెడ్డిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశానని చెప్పింది వైశాలి. తన కేరీర్ ను నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తాను పిర్యాదు చేసిన సమయంలోనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడింది. తాను పిర్యాదు చేసిన సమయంలో పోలీస్ అధికారి ఎవరి జాగ్రత్తలో వాళ్లు అండాలని చెప్పారు కానీ రక్షణకు భరోసా ఇవ్వలేదన్నారు. తనకు అతని నుండి రక్షణ కల్పించాలని, నవీన్ రెడ్డిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ వైశాలితో పరిచయం పెంచుకున్న నవీన్ రెడ్డి తననే పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో వైశాలి తల్లిదండ్రులు మరొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని శుక్రవారం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి ఏకంగా వంద మందితో వైశాలి ఇంటికి వెళ్లి అడ్డువచ్చిన వాళ్లను కొట్టి సినీ పక్కీలో ఆమెను కిడ్నాప్ చేయడం, ఆ క్రమంలో వైశాలి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో తమ ఇంటి ముందు ఉన్న నవీన్ టీ రెస్టారెంట్ ను తగలబెట్టడం తీవ్ర సంచలనం అయ్యింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?