అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచిన సంగతి తెలిసిందే. జనవరి 20వ తారీఖున కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న తరుణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇంకా అధ్యక్ష పదవి చేపట్టక ముందే జో బైడెన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.
ఉత్తర కొరియా దేశానికి అతిపెద్ద శత్రువు అమెరికా అని పేర్కొన్నాడు. అంతేకాకుండా తన దేశానికి చెందిన శాస్త్రవేత్తలకు శక్తివంతమైన అణ్వస్త్రాలు రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇదే విషయాన్ని ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఎవరు అధికారంలోకి వచ్చినా వైట్ హౌస్ శత్రువు విధానాల్లో మార్పు ఉండే అవకాశం ఉండదని ఒకవేళ విధానాలు మారితే మాత్రం ఉత్తర కొరియా అమెరికా సంబంధాలు బలోపేతానికి సరికొత్త ఆవిష్కృతం అవుతుందని కిమ్ తెలిపినట్లు ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్ఏ వివరించింది.
అంతేకాకుండా ఇకనుండి విదేశాంగ రాజకీయ కార్యకలాపాలు మొత్తం అమెరికాని కట్టడి చేయడం తరహాలోనే ఉంటాయని ఉత్తరకొరియా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అమెరికాలో అధ్యక్షుడు ఎవరు వచ్చినా గానీ ఉత్తర కొరియా దేశం పై మార్పు ఉండదని ఇదే క్రమంలో దేశ అణు ఆయుధాలను దుర్వినియోగం చేయకూడదు అని అదే రీతిలో దురాక్రమణదారు లకు దీటుగా బదులు ఇవ్వాలి అంటూ అధ్యక్షుడు కిమ్ స్పష్టం చేసినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ కేసీఎన్ఏ వివరించింది. ఈ పరిణామంతో అమెరికా కొత్త అధ్యక్షుడు కాబోతున్న జో బైడెన్ కి ముందుగానే కిమ్ తన వైఖరి విధానాన్ని తెలియజేసి కంగు తినిపించినటు అయింది అని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా ట్రంపు తో ఇదే తరహాలో కిమ్ వ్యవహార శైలి ఉందని ఇప్పుడు అదే ఈ విధానం కొత్త అధ్యక్షుడితో కంటిన్యూ చేస్తున్నట్లు ఉందని చెప్పుకొస్తున్నారు.