Simha : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి కొడుకు హీరోగా మారిన సంగతి తెలిసిందే. సింహా హీరోగా డెబ్యూ సినిమా ‘మత్తువదలరా’ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ‘మత్తువదలరా’ సినిమా తర్వాత సింహా హీరోగా రెండవ సినిమా ‘తెల్లవారితే గురువారం’ వచ్చింది. ఈ సినిమాతోనూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈ యంగ్ హీరోకి అభిమానులు కూడా తయారయ్యారు. సింహాను ప్రమోట్ చేయడానికి టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు స్టార్స్ సపోర్ట్ చేశారు.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దాంతో సింహా మూడవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. లేటయినా మంచి కథతో వచ్చి హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా చాలా కథలు విన్నాడు. వీటిలో సింహాకు ఒక కథ నచ్చి ఎంపిక చేసుకున్నాడు. కాగా సింహా మూడవ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మించడం విశేషం. సురేష్ బాబుకి కథ ఎంతగా నచ్చితే గానీ సినిమా నిర్మించడానికి ముందుకు రారు. దాన్ని బట్టే సింహా ఎంచుకున్న కథ ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతోంది.
Simha : సినిమా మొదలవకుండానే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాను నూతన దర్శకుడు సతీష్ త్రిపుర తెరకెక్కించనున్నాడు. ఆయన చెప్పిన కథ నచ్చడంతో సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. ఈ సినిమా కథను బట్టి ఇప్పటికే ‘దొంగలున్నారు జాగ్రత్త’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకి తాజాగా పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టడానికి షెడ్యూల్స్ ప్లాన్స్ రెడీ అవుతున్నాయి. ఇక తమిళ స్టార్, విలక్షణ నటుడు సముద్రఖని ఇందులో కీలక పాత్ర పోషించనున్నారు. సినిమా మొదలవకుండానే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సింహా మూడవ సినిమాగా రాబోతున్న ‘దొంగలున్నారు జాగ్రత్త’తో హిట్ అందుకుంటాడా చూడాలి.