మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు మూడు సినిమాలు కమిటయ్యారు. ఇప్పటికే ఆచార్య 40 శాతం షూటింగ్ కంప్లీటయింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ బ్యానర్స్ మీద రాం చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ ఆగ్ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి కొంత కామెడీ పార్ట్ యాడ్ చేయమని స్వయంగా మెగాస్టార్ దర్శకుడికి సూచించడంతో ప్రస్తుతం కొరటాల శివ అదే పనిలో ఉన్నారట. ప్రముఖ రచయిత ఆకుల శివ సహకారంతో కొరటాల కొన్ని కామెడీ సీన్స్ ని యాడ్ చేస్తున్నారని సమాచారం.
కాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వేదాళం రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేష్ మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారట. స్క్రిప్ట్ లో మెగాస్టార్ సలహాలివ్వడంతో ఆ రకంగానే సీన్స్ ని కొత్తగా రాస్తున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమా 2021 లో మొదలయ్యే విధంగా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో కీలకమైన మెగాస్టార్ చెల్లెలి పాత్రకోసం టాలీవుడ్ లో పాపులర్ ఉన్న పలువురు హీరోయిన్స్ పేర్లని పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే నేచురల్ పర్ఫార్మర్ సాయి పల్లవి ని చిరంజీవికి చెల్లిగా తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి లవ్ స్టోరీ కంప్లీట్ చేసింది. ఇక రానా తో విరాట పర్వం చేస్తుంది. అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న శ్యామ్ సింగ్ రాయ్ సినిమాలో కూడా నటించబోతుంది.
ఇక తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తుండగా ఈ న్యూస్ మెగా అభిమానులకి బాగా ఉత్సాహాన్నిచ్చింది. ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానప్పటికి దాదాపు కీర్తి సురేష్ ఒకే అయినట్టు సమాచారం. మెగాస్టార్ సినిమా కోసం కీర్తి ఏకంగా బాలీవుడ్ సినిమాని కూడా వదులుకుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం మిస్ ఇండియా రిలీజ్ ఓటీటీలో రిలీజ్ కాబోతుండగా నితిన్ తో నటించిన రంగ్ దే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
మహేష్ తో సర్కారు వారి పాట, గుడ్ లక్ సఖీ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే లో కూడా నటిస్తుంది. మరి మెగాస్టార్ కి సిస్టర్ గా నటించే అఫీషియల్ న్యూస్ ఎప్పుడు రానుందో చూడాలి. ఈ న్యూస్ కోసం మాత్రం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.