NewsOrbit
న్యూస్

ఏపీలో ఎగరనున్న ‘గాలిపటం’?జగన్ పార్టీకి తప్పదా ఇరకాటం ??

బీహార్ ఎన్నికల్లో ఐదు సీట్లు సాధించటం ద్వారా తన సత్తా చూపిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు ఇతర రాష్ర్టాల్లో కూడా తనకుగల విజయ అవకాశాలను పరిశీలిస్తోంది.ఈ క్రమంలో మజ్లిస్ పార్టీ కన్ను ఏపీపై కూడా పడిందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో కనీసం పదిహేను నియోజకవర్గాల్లో ముస్లింల డామినేషన్ ఉంది. దీంతో మజ్లిస్ అధినేత ఒవైసీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీకి దిగితే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తున్నారని దారుస్సలాం వర్గాలు చెప్పాయి.మజ్లిస్ పార్టీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే అది ఇంతకుముందు కేవలం హైద్రాబాదు కి పరిమితమైంది.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైద్రాబాదులో ఏడు సీట్లు మజ్లిస్ పార్టీకి లభించాయి .ఇక హైద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని మజ్లిస్ కే అన్ని పార్టీలు రాసిచ్చేశాయి. మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీ బతికున్నంతకాలం ఆయన ఎంపీగా ఉన్నారు.ఇప్పుడు ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టారు.వరుసగా ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు.ఇంకా చెప్పాలంటే హైద్రాబాద్ లోక్సభ ఎన్నికల్లో పోటీ అన్నది నామమాత్రం.పోలింగ్ జరగకుండానే అక్కడ మజ్లిస్ గెలుస్తారని చెప్పటం వాస్తవం.

కాగా ఇటీవల మజ్లిస్ జాతీయ పార్టీగా రూపు దిద్దుకుంది.ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేసి రెండు సీట్లను దక్కించుకుంది.తాజాగా బీహార్లో హోరాహోరీగా జరిగిన పోరులో కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ఐదుగురు గెలవటం ఆల్టైమ్ రికార్డ్.ఈ విజయంతో మజ్లిస్ పార్టీ భవిష్యత్తులో ఇంకా ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న సమాలోచనలు మొదలెట్టింది.ఈ సందర్భంలో వారికి ఆంధ్రప్రదేశ్ కనిపించిందట.ఎప్పటి నుండో ఏపీలో పోటీ చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.మొన్నటి ఎన్నికల్లో ఏపీలో పోటీకి ఒవైసీ సిద్ధమైనప్పటికీ జగన్ కి మిత్రుడిగా ఉన్న కెసిఆర్ సలహా మేరకు మజ్లిస్ వెనక్కితగ్గిందంటున్నారు.

ఇప్పుడు కెసిఆర్ కి జగన్ కి కూడా సంబంధాలు కొద్దిగా చెడినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఒవైసీ ఏపీ వైపు దూసుకు వచ్చే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు .నిజానికి ఏపీలో ఉన్న పార్టీలన్నింటిపై ముస్లింలకు అసంతృప్తి ఉంది.వారు తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప తమకు చేసిందేమీ లేదని ముస్లింలు భావిస్తున్నారు.జగన్ తన మంత్రివర్గ సహచరుడు అంజాద్ బాషాను ఉపముఖ్యమంత్రిని చేసినప్పటికీ మరో ఇక్బాల్ అనే నాయకుడ్ని ఎమ్మెల్సీని చేసినప్పటికీ అంతా రాజకీయ డ్రామా అని భావిస్తున్నవారున్నారు.ఈ పరిస్థితుల్లో ముస్లిములు సొంత పార్టీ గా భావించే మజ్లిస్ గనుక ఏపీలో రంగప్రవేశం చేస్తే రాజకీయ సమీకరణాలు మారతాయని, వైసిపి ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju