టాలీవుడ్ లో డెబ్యూ మూవీ భరత్ అనే నేను సినిమాతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే ఛాన్స్ అందుకుంది కియారా అద్వాని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. దాంతో మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన వినయ విధేయ రామ లో నటించింది. ఇలా రెండు సినిమాలు చేసిన కియారా ఇక మళ్ళీ తెలుగులో నటించే సమయం దొరకడం లేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోలు నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో యమా బిజీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో అవకాశం వచ్చిన డేట్స్ సర్దుబాటు చేయలేకపోయిందన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఒక సౌత్ సినిమాకి కియారా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ లో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీ బాంబ్’ సినిమాలో కియారా హీరోయిన్ గా నటించింది.
అయితే ఈ సారి లారెన్స్ కి జంటగా తమిళంలో రూపొందబోతున్న చంద్రముఖి 2 సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. పి వాసు దర్శకత్వంలో చంద్రముఖి 2 తెరకెక్కనుంది. సూపర్ హిట్ చంద్రముఖి కి సీక్వెల్ గా రూపొందుతుండగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కియారా ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధిచిన ఇతర విషయాలు మేకర్స్ వెల్లడిస్తారని తెలుస్తుంది. ఇక 2005 లో వచ్చిన చంద్రముఖి సంచలన విజయం సాధిన విషయం తెలిసిందే.