దేశంలో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సంవత్సరం సంవత్సరానికి అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, విద్యార్థులు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొంతమంది ఛార్జింగ్ విషయంలో చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వార్తల్లో ఎక్కువగా ఫోన్ బ్యాటరీ పేలిపోయిందనే వార్తను వింటూ ఉంటాం. అయితే ఛార్జింగ్ పెట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రమే ఫోన్ పేలే అవకాశం ఉంటుంది. ఎక్కువ బ్యాటరీ ఉంటే ఎక్కువ సమయం వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ కు అవసరమైన బ్యాటరీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటూ ఉంటారు. చాలామంది రాత్రంతా ఫోన్ కు ఛార్జింగ్ పెడుతూ ఉంటారు.
అయితే రాత్రంతా ఫోన్ కు ఛార్జింగ్ పెట్టినా పెట్టినా స్మార్ట్ ఫోన్ కు ఏం కాదు. ప్రత్యేకమైన టెక్నాలజీ సహాయంతో స్మార్ట్ ఫోన్లు పని చేస్తాయి. అందువల్ల 100 శాతం ఛార్జింగ్ అయిన తరువాత ఫోన్లు ఛార్జ్ కావు. అయితే పాత స్మార్ట్ ఫోన్లను మాత్రం రాత్రి సమయంలో చార్జ్ చేయకపోవడమే మంచిది. రాత్రి సమయంలో ఫోన్ ను చార్జింగ్ చేసేవాళ్లు ఫోన్ కేస్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు.
ఫోన్ ను ఛార్జింగ్ చేసే సమయంలో కంపెనీ ఛార్జర్ ను మాత్రమే వినియోగించాలి. నకిలీ ఛార్జర్ లు బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి నకిలీ ఛార్జర్ లను వినియోగించకపోవడమే మంచిది. ఫోన్ బ్యాటరీ జీరో అయిన తరువాత ఛార్జింగ్ చేయడం కంటే ఫోన్ బ్యాటరీ 20 నుంచి 30 శాతం మధ్య ఉన్న సమయంలో మాత్రమే ఛార్జింగ్ చేయడం మంచిది. ఫోన్ కు ఛార్జింగ్ పెట్టే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్ పేలే అవకాశాలు తక్కువగా ఉంటాయి.